మంత్రి పొన్నం ప్రభాకర్కు జమ్మికుంట నాయకుల ఘన సత్కారం.
Views: 0
On
జమ్మికుంట టౌన్ జూలై 30 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ బస్టాండ్లో నగర లోకల్ బస్సుల సేవలను ప్రారంభించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను జమ్మికుంటకు చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య, జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబాల రాజు మంత్రికి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. ప్రజలకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Jul 2026 21:31:53
పెద్దమందడి,జూలై30(తెలంగాణ ముచ్చట్లు):
ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిడిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఓటరు దరఖాస్తులను బూత్వారీగా 100% శాతం పూర్తి చేసిన...


Comments