అర్హులైన ప్రతి ఓటరే లక్ష్యం.. క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):
హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలోని 204, 205 పోలింగ్ బూత్ల పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక ధృవీకరణ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా ఉండేలా బూత్ అధ్యక్షులు, బీఎల్వోలు సమన్వయంతో విస్తృతంగా కృషి చేస్తున్నారు.
పట్టణానికి వెలుపల నివసిస్తున్న ఓటర్లను సైతం ఫోన్ ద్వారా సంప్రదించి వారి వివరాలను నిర్ధారిస్తూ, అవసరమైన సమాచారాన్ని బీఎల్వోలకు అందజేస్తున్నారు. దీంతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగంగా పూర్తయ్యే దశకు చేరుకుంది.
ఈ సందర్భంగా జమ్మికుంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని కోటి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అత్యంత విలువైనదని అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేస్తున్న బూత్ అధ్యక్షులు, బీఎల్వో అధికారుల సేవలు ప్రశంసనీయమ
ని కొనియాడారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ప్రజలందరూ సహకరించి తమ వివరాలను సరిచూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Comments