బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థికసాయం చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి.
Views: 0
On
కొత్తకోట,ఆగస్టు01(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన కొత్త చిన్న సవరయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థికసాయం అందించారు.బాధిత కుటుంబానికి గ్రామ సర్పంచ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని పంపించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుడు కొత్త నరసింహకు ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 Aug 2026 19:49:20
* ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు.. ఇంటర్ అర్హత కలిగిన స్థానిక మహిళలకు అవకాశం
జమ్మికుంట టౌన్ ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):...


Comments