వీణవంక జూనియర్ కళాశాలకు ఎం. కుమార్ సారథ్యం.

వీణవంక జూనియర్ కళాశాలకు ఎం. కుమార్ సారథ్యం.

వీణవంక, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అదనపు బాధ్యతల ప్రిన్సిపల్‌గా జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం. కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎం. కుమార్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉన్నందున అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా పాఠ్యబోధన, పరీక్షల సన్నద్ధత, కెరీర్ మార్గదర్శకత్వంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆయన పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
  బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ సభలో రావుల వేణుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కితాబు.
స్నేహ బంధానికి ప్రపంచం వందనం.
వేంసూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం.
జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి.
భూ వివాదం ఉద్రిక్తం.. దంపతులపై దాడి జరిగిందని ఆరోపణ.