వేలేరులో ప్రజాప్రతినిధులు–అధికారుల సమన్వయ, సమీక్ష సమావేశం.

వేలేరులో ప్రజాప్రతినిధులు–అధికారుల సమన్వయ, సమీక్ష సమావేశం.

వేలేరు ఆగస్టు 5(తెలంగాణ ముచ్చట్లు ):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేలేరు మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ మరియు సమీక్ష సమావేశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, వేలేరు మండల ప్రత్యేక అధికారి విజయ్ చందు అధ్యక్షతన నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో వేలేరు మండల తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ కిషన్ నాయక్, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి విజయ్ చందు, తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వేలేరు మండలంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అవుతున్నాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు, సర్పంచులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో సర్పంచులు అశోక్, అనిత, కిరణ్, శ్రీనివాస్, రమాదేవి, మానస, సాంబయ్యతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ: కౌశిక్ రెడ్డి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ: కౌశిక్ రెడ్డి.
*పక్క చూపులు చూసేవారు పార్టీని వీడొచ్చు.. బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరిక* హుజూరాబాద్, ఆగస్టు 5 (తెలంగాణ ముచ్చట్లు): ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి...
వనపర్తి ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి రూ.20 లక్షలు.
ఎల్‌నినో ప్రభావం.. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి .
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాయి గణేష్ ఎంపిక.
వేలేరులో ప్రజాప్రతినిధులు–అధికారుల సమన్వయ, సమీక్ష సమావేశం.
ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్.
ప్రకృతిని ప్రేమించడం ఒక కళ.