సత్యనారాయణ కాలనీలో కార్తీక పౌర్ణమి పూజలు
నాగారం, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు)
నాగారం మున్సిపాలిటీలోసత్యనారాయణ కాలనీ శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి మరియు శ్రీ శిరిడి సాయిబాబా దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తిపూర్వకంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దీపదానం చేసి స్వామి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ అన్నం రాజు శ్రీనివాస్, అన్నం రాజు సురేష్, సలహాదారులు వెంకటరత్నం, చిట్యాల శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కాలనీ ప్రధాన కార్యదర్శి బి. నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కందాడి శ్రీనివాస్ రెడ్డి, ముక్కెర కరుణాకర్ రెడ్డితో పాటు సాయిలు, రెడ్యానాయక్, భద్రు నాయక్, సాయి గౌడ్, అభిలాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.భక్తుల సౌకర్యార్థం దేవస్థానం కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పవిత్ర వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులకు ఆత్మీయ ఆనందాన్ని కలిగించింది.


Comments