సూరారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశం

ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొన్నం ఇన్అనూప్ గౌడ్ 

సూరారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశం

ఎల్కతుర్తి. నవంబర్03 (తెలంగాణ ముచ్చట్లు) 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన గృహాల్లో గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొన్నం అనూప్ గౌడ్ హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం నిర్వహించారు.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు సింగవేన మానస మాట్లాడుతూ, “ఇందిరమ్మ ఇల్లు రావడం ఎంతో సంతోషంగా ఉంది. నా సొంత ఇంటి కల నెరవేరింది. ఈ సంతోషాన్ని ఇచ్చిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు మరియు గ్రామ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.

WhatsApp Image 2025-11-03 at 8.37.27 PM (1)ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీ, సూరారం గ్రామ శాఖ అధ్యక్షుడు బచ్చు శ్రీధర్ రావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ మండ సుమన్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ బచ్చు బాపురావు, దాట్ల ప్రవీణ్, మొలుగురి భాస్కర్, కుర్ర చంద్ర ప్రకాష్, పోలాటి తిరుమల్ రావు, భాష బోయిన సంతోష్, ఉట్కూరి ప్రణీత్ గౌడ్, పెంకచికల్ పేట్, గ్రామ శాఖ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, జగన్నాధపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు ముష్కే శ్రీనివాస్, శేఖర్ గౌడ్, రఘురాం గౌడ్, రాంభూపాల్ రెడ్డి, చల్లూరి వేణు, ఇరువాల సాంబయ్య, పుల్లింటి సంపత్, గడలా అజయ్ తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం