లీడర్స్ స్కూల్ లో సాక్షి అక్షర పోటీ పరీక్షలు నిర్వహణ 

వెల్టూర్  లీడర్స్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేష్

లీడర్స్ స్కూల్ లో సాక్షి అక్షర పోటీ పరీక్షలు నిర్వహణ 

పెద్దమందడి,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ లీడర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో సోమవారం 1వ నుండి 7వ తరగతి విద్యార్థుల కోసం సాక్షి అక్షర పోటీ పరీక్షలు ప్రిన్సిపల్ వెంకటేష్ నేతృత్వంలో నిర్వహించబడ్డాయి. ఈ పోటీ పరీక్షలు నాలుగు దశల్లో జరుగుతాయని ప్రిన్సిపాల్ వెంకటేష్ తెలిపారు. సోమవారం మొదటి దశ పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

 ప్రిన్సిపాల్ వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ పోటీ పరీక్షల ప్రధాన లక్ష్యం విద్యార్థుల అక్షర నైపుణ్యాలను పెంపొందించడం, పదజాలాన్ని విస్తరించడం, ఆంగ్ల ఉచ్చారణ నైపుణ్యాలను మెరుగుపరచడం, అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే అని వారు చెప్పారు.

విద్యార్థులు పోటీ పరీక్షల ద్వారా తమ నైపుణ్యాలను పరీక్షించుకోవడం, నూతన పదాలు నేర్చుకోవడం మరియు సాహసంతో మాట్లాడడం వంటి అంశాల్లో అభ్యసిస్తారని. ఈ పోటీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక మంచి అవకాశం అని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, మరియు కరస్పాండెంట్ విష్ణువర్ధన్ సాగర్ పాల్గొన్నారు. విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పోటీ పరీక్షలను సాకారాత్మకంగా స్వీకరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం