సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం

మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కొకుట్ల చంద్రారెడ్డి ఫిర్యాదు

సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం

నాగారం, నవంబర్ , నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు)

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైన్‌షాప్‌పై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నాగారం మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కొకుట్ల చంద్రారెడ్డి  తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదు సమర్పించారు.
సుమారు 400 కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీ పక్కనే కృష్ణవేణి టాలెంట్ స్కూల్, క్రాంతి చిల్డ్రన్స్ హాస్పిటల్, బస్టాండ్, శుక్రవారం మార్కెట్ వంటి ముఖ్యమైన ప్రజా ప్రాంతాలు ఉండగా, ప్రజలు, ముఖ్యంగా మహిళలు మరియు విద్యార్థులు ప్రయాణించే ప్రధాన రహదారిపై వైన్ షాప్ ఏర్పాటు చేయడం ప్రజల భద్రతకు ముప్పుగా మారుతుందని ఆయన తెలిపారు.అంతే కాకుండా నందమూరి తారకారామారావు , దొడ్డి కొమరయ్య  విగ్రహాలు ఉన్న గౌరవనీయమైన స్థలానికి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం సముచితం కాదని పేర్కొన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ మరియు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం జరుగుతుండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రతిపాదిత వైన్‌షాప్‌ను వెంటనే రద్దు చేసి స్థానిక ప్రజలకు న్యాయం చేయాలని ఎక్సైజ్ శాఖను చంద్రారెడ్డి  కోరారు. స్థానిక కాలనీలవాసులు కూడా ఈ కదలికకు మద్దతు తెలుపుతూ త్వరితగతిన స్పందించాలని అధికారులను కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం