తల్లిని కడతేర్చిన.. తనయుడు

నిందితుడిని అరెస్టు చేసిన ఎస్సై కూచిపూడి జగదీష్.

తల్లిని కడతేర్చిన.. తనయుడు

 ఖమ్మం బ్యూరో , నవంబర్ 3,తెలంగాణ ముచ్చట్లు:

చివరి గడియల్లో తల్లికి అండగా ఉంటాడనుకున్న కొడుకు కాలయముడయ్యాడు.నవ మాసాలు మోసిన తల్లిని మద్యానికి బానిసై కన్న పెగే కాటికి చేర్చిన విషాదం తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన మందుల బూబ (50)అనే మహిళ కొడుకు మధు చేతిలో హతమైంది. బూబ భర్త గతంలోనే చనిపోయాడు.WhatsApp Image 2025-11-03 at 8.55.58 PM కొడుకు మధు కు వివాహంచేయగా, ఇద్దరు కొడుకులు జన్మించిన తరువాత భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాల్లో, రెండు సంవత్సరాల క్రితం మధు భార్య ఇద్దరు కొడుకులను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో మద్యానికి బానిసైన మందుల మధు తన తల్లిని మద్యం కొరకు పెన్షన్ డబ్బులు ఇవ్వమని అడగగా ఆమె నిరాకరించడంతో ఆదివారం రాత్రి గొడ్డలితో కొట్టి హత మార్చడని మృతురాలి తమ్ముడు నల్లగట్టు కాశయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు మందుల మదు పై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిందితుడు మందుల మధుని అరెస్టు చేయడమైనదని ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .