పాఠశాల భవనంలోనే ఆరోగ్య ఉపకేంద్రం 

స్వంత భవనం నిర్మించాలంటూ మల్లికుదుర్ల ప్రజల ఆవేదన

పాఠశాల భవనంలోనే ఆరోగ్య ఉపకేంద్రం 

వేలేరు,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రం దయనీయ పరిస్థితుల్లో కొనసాగుతోంది. సోడాషాపల్లి, మల్లికుదుర్ల, గుండ్లసాగర్ గ్రామాలకు ఒకటే ఉపకేంద్రంగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ స్వంత భవనం లేకపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

తాత్కాలికంగా పాఠశాల భవనంలోనే ఈ కేంద్రం నడుస్తుండటంతో విద్యార్థులు, రోగులు ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేకపోవడంతో రోగులు అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షాకాలంలో నీటిచొరబాటు, దుమ్ము, మురికి వాతావరణం కారణంగా ఆరోగ్య కేంద్రం వద్ద రోగులు చికిత్స పొందడం కష్టంగా మారిందని గ్రామస్తులు తెలిపారు.

మల్లికుదుర్ల, సోడాషాపల్లి, గుండ్లసాగర్ గ్రామాల ప్రజలు ఈ ఉపకేంద్రానికి శాశ్వత భవనం నిర్మించి, తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. “మన ఆరోగ్యానికి ఇది ప్రాధమిక అవసరం… ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలి” అని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .