జెడ్‌పీ బాలికల పాఠశాల విద్యార్థినుల గెలుపు జెండా.

రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ముగ్గురు విద్యార్థినుల ఎంపిక.

జెడ్‌పీ బాలికల పాఠశాల విద్యార్థినుల గెలుపు జెండా.

సత్తుపల్లి, నవంబర్‌ 3 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు క్రీడా రంగంలో తమ ప్రతిభను మరోసారి నిరూపించారు. ఆదివారం అదే పాఠశాలలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్‌–14 కరాటే ఎంపిక పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి ముగ్గురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

ఈ పోటీల్లో ఎస్‌.డి. ఆఫ్రిన్‌, ఎం. పావని, ఎం. ప్రహర్షిక తమ చురుకుదనం, పట్టుదలతో ఆకట్టుకుని పాఠశాల పేరు మరింత ఎత్తుకు చేర్చారు. ఈ విజయం పాఠశాలకు మాత్రమే కాకుండా మొత్తం సత్తుపల్లి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

వారి విజయంపై ప్రధానోపాధ్యాయుడు ఎన్‌. నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు (పిడి) చీకటి శ్రీదేవి హర్షం వ్యక్తం చేశారు. వీరు రాష్ట్ర స్థాయిలోనూ బాగా ప్రదర్శించి జాతీయ స్థాయికి వెళ్లాలని మా ఆశయం అని చెప్పారు.

ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ, విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో వ్యాయామ ఉపాధ్యాయుల (పిడి) పాత్ర చాలా ముఖ్యమైనది. వారి శిక్షణ, మార్గదర్శకత, ప్రోత్సాహం వల్లే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయి అని అన్నారు.

ఈ విజయంతో అయ్యగారిపేట జెడ్‌పీ బాలికల పాఠశాల పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు, విద్యా వర్గాలు విద్యార్థినుల విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .