మిత్రుని కష్టసమయంలో తోడుగా నిలిచిన పదవ తరగతి స్నేహితులు

మిత్రుని కష్టసమయంలో తోడుగా నిలిచిన పదవ తరగతి స్నేహితులు

పెద్దమందడ,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):

అడ్డాకుల మండలం బలీదు పల్లి గ్రామానికి చెందిన పదవ  సత్యనారాయణ  ఇటీవల హైదరాబాద్ కోకాపేట్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెల్టూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో (1997- 1998)బ్యాచ్ కలిసి చదువుకున్న తోటి స్నేహితులు విషయం తెలిసిన వెంటనే  స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ... మిత్రుడు జీవిత పోరాటంలో నిలబడేందుకు అండగా ఉండాలనే భావనతో, పదవ తరగతి క్లాస్‌మేట్స్ అందరూ ఒక చోట చేరి సహాయం చేయాలని నిర్ణయించారు.

ఆ నిర్ణయంతో తక్షణమే ప్రతి ఒక్కరు తమవంతు సహాయాన్ని అందిస్తూ, మొత్తం రూ.93,000/-రూపాయల మొత్తాన్ని సేకరించారు. ఆ మొత్తాన్ని బాధితుడైన సత్యనారాయణ భార్యకు వ్యక్తిగతంగా అందజేశారు. ఈ సందర్భంలో స్నేహితులు మాట్లాడుతూ ..మనలో ఎవరికైనా ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు మనమందరం కలసి సహాయం చేసుకోవాలి, అదే నిజమైన మానవత్వం, అదే నిజమైన స్నేహం” అని తెలిపారు.

పదవ తరగతి రోజుల నుండి ఒకే బంధంతో కొనసాగుతున్న ఈ స్నేహితులు సత్యనారాయణ  కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అలాగే ప్రమాదం తర్వాత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ  త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరూ మనస్పూర్తిగా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం ద్వారా స్నేహితుల మధ్య మానవతా విలువలు, పరస్పర సహకారం ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పబడింది.
గ్రామ ప్రజలు, స్థానికులు కూడా క్లాస్‌మేట్స్ చేసిన ఈ మంచి పనిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాణిక్ వర్మ, ధనుంజయ, చందు రెడ్డి, శివకుమార్, బాలనాగి, సత్యనారాయణ కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .