మిత్రుని కష్టసమయంలో తోడుగా నిలిచిన పదవ తరగతి స్నేహితులు

మిత్రుని కష్టసమయంలో తోడుగా నిలిచిన పదవ తరగతి స్నేహితులు

పెద్దమందడ,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):

అడ్డాకుల మండలం బలీదు పల్లి గ్రామానికి చెందిన పదవ  సత్యనారాయణ  ఇటీవల హైదరాబాద్ కోకాపేట్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెల్టూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో (1997- 1998)బ్యాచ్ కలిసి చదువుకున్న తోటి స్నేహితులు విషయం తెలిసిన వెంటనే  స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ... మిత్రుడు జీవిత పోరాటంలో నిలబడేందుకు అండగా ఉండాలనే భావనతో, పదవ తరగతి క్లాస్‌మేట్స్ అందరూ ఒక చోట చేరి సహాయం చేయాలని నిర్ణయించారు.

ఆ నిర్ణయంతో తక్షణమే ప్రతి ఒక్కరు తమవంతు సహాయాన్ని అందిస్తూ, మొత్తం రూ.93,000/-రూపాయల మొత్తాన్ని సేకరించారు. ఆ మొత్తాన్ని బాధితుడైన సత్యనారాయణ భార్యకు వ్యక్తిగతంగా అందజేశారు. ఈ సందర్భంలో స్నేహితులు మాట్లాడుతూ ..మనలో ఎవరికైనా ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు మనమందరం కలసి సహాయం చేసుకోవాలి, అదే నిజమైన మానవత్వం, అదే నిజమైన స్నేహం” అని తెలిపారు.

పదవ తరగతి రోజుల నుండి ఒకే బంధంతో కొనసాగుతున్న ఈ స్నేహితులు సత్యనారాయణ  కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అలాగే ప్రమాదం తర్వాత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ  త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరూ మనస్పూర్తిగా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం ద్వారా స్నేహితుల మధ్య మానవతా విలువలు, పరస్పర సహకారం ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పబడింది.
గ్రామ ప్రజలు, స్థానికులు కూడా క్లాస్‌మేట్స్ చేసిన ఈ మంచి పనిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాణిక్ వర్మ, ధనుంజయ, చందు రెడ్డి, శివకుమార్, బాలనాగి, సత్యనారాయణ కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం