మీనాక్షి నటరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లెల ఆదిత్య రెడ్డి

మీనాక్షి నటరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లెల ఆదిత్య రెడ్డి

వనపర్,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ ను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో వృత్తిపరుల కాంగ్రెస్ విభాగాన్ని బలపరచడం, యువ వృత్తిపరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సామాజిక , రాజకీయ అవగాహన కార్యక్రమాలను విస్తరించడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ విస్తరణకు తీసుకోవలసిన చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.

శ్రీమతి మీనాక్షి నటరాజన్  విలువైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ప్రజలతో నేరుగా మేళవించే కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి జిల్లా స్థాయిలో చురుకైన నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం