కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి 

 కార్పొరేటర్ ప్రభుదాస్ పర్యటన

కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి 

కాప్రా, నవంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు):

మీర్పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్‌లోని అన్నపూర్ణ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలిస్తూ స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, సీసీ రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ, కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయించేలా కృషి చేస్తామన్నారు. మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పర్యటనలో నరసింహ గౌడ్, సంజయ్ నాయక్, ప్రేమ్ సాగర్, చంద్రశేఖర్, ప్రసాద్, రాజమల్లు, రాజలింగం తదితర స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం