కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి
కార్పొరేటర్ ప్రభుదాస్ పర్యటన
కాప్రా, నవంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు):
మీర్పేట్ హెచ్బి కాలనీ డివిజన్లోని అన్నపూర్ణ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలిస్తూ స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, సీసీ రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ, కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయించేలా కృషి చేస్తామన్నారు. మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పర్యటనలో నరసింహ గౌడ్, సంజయ్ నాయక్, ప్రేమ్ సాగర్, చంద్రశేఖర్, ప్రసాద్, రాజమల్లు, రాజలింగం తదితర స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.


Comments