కీసరగుట్టలో కార్తీక పౌర్ణమి సందడి
భక్తులతో కళకళలాడిన శ్రీరామలింగేశ్వర ఆలయం
కీసర, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు) :
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా కీసరగుట్టలోని శ్రీ భవాని శివదుర్గ సమేత స్వయంభూ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజాముననే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడ్డారు.భక్తులు గంగాజలంతో స్వామివారికి అభిషేకాలు చేస్తూ హరహర శంభో నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న శివలింగాలకుమహిళలు పాలాభిషేకాలు చేయగా, కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శానిటేషన్, తాగునీటి సదుపాయం, భద్రతా చర్యలను బలోపేతం చేయడంతో భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా దర్శనం జరుగుతోందని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, కార్యనిర్వాహణ అధికారి కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు.కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొనడంతో కీసరగుట్టలో పండుగ వాతావరణం నెలకొంది.


Comments