శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు
కాప్రా, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
కాప్రాలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిగాయి. ఉదయం ప్రత్యేక పూజలు, హోమాలు, సాయంత్రం దీపోత్సవంతో ఆలయ ప్రాంగణం శోభాయమానమైంది.ప్రాంగణమంతా దీపాలతో వెలుగుల హరివిల్లు సుందరంగా అలరించింది.భక్తుల సందోహం అధికంగా ఉండటంతో దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు సద్విధంగా నిర్వహణ జరిగేలా కమిటీ శ్రద్ధ తీసుకుంది.
దేవాలయ నిర్వహణ, సేవాభావం భక్తులను ఆకట్టుకుంది. స్వల్ప కాలంలోనే భక్తులు మరియు ప్రధాన అర్చకుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కొత్త షెడ్డులో మొదటి భారీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో దేవాలయ ఈ.ఓ కృష్ణమాచారి,మేడ్చల్–మల్కాజిగిరి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ విటల్ నాయక్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పొట్టు బాబూరావు, పడమటి మల్లారెడ్డి, నరేందర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, వినోద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments