సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలి.!

సత్తుపల్లి డిపోను పరిశీలించిన ఖమ్మం డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య .

సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలి.!

సత్తుపల్లి, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

సంస్థ అభివృద్ధిలో ప్రతి ఉద్యోగి నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఖమ్మం డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య శుక్రవారం సత్తుపల్లి డిపోను సందర్శించి తెలిపారు.

డిపో మేనేజర్ కార్యాలయంలో డిపో ఏడీసీలు, కంట్రోలర్స్ తో నిర్వహించిన సమావేశంలో రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉండటంతో వాటి నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని మల్లయ్య గారు సూచించారు. ముందుగా డిపో గ్యారేజ్‌ను పరిశీలించి, నిర్వహణపై తగిన సూచనలు చేశారు.

డిపో అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొని, వారితో తరచుగా సమావేశాలు నిర్వహించి ఇపికే, ఓఆర్ పెరుగుతుండే విధంగా చూడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కల్లూరు బస్టాండు, బంజార బస్టాండులను కూడా పరిశీలించారు. గతంలో అందించిన విధమైన కృషిని కొనసాగిస్తూ డిపో అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని మల్లయ్య గారు ఆకాంక్షించారు.

డిపో అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై అధికారులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఊటుకూరి సునీత, అసిస్టెంట్ మేనేజర్ పి. విజయశ్రీ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్. సాహితి, ఏబీసీలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం