పార్కుల అభివృద్ధి పనులపై పర్యటించిన కార్పొరేటర్ ప్రభుదాస్

పార్కుల అభివృద్ధి పనులపై పర్యటించిన కార్పొరేటర్ ప్రభుదాస్

కాప్రా, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్‌.బీ. కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్ పార్కు మరియు కృష్ణానగర్ పార్కులను అభివృద్ధి చేయడానికి చేపట్టిన మరమ్మత్తు పనుల పురోగతిని పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ అధికారులతో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, రాజీవ్ పార్కులో పాడైన జిమ్ పరికరాల స్థానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెట్ల చుట్టూ ఉన్న కొమ్మలను తొలగించి, పార్కు పరిసరాలను శుభ్రం చేసి పచ్చదనం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.WhatsApp Image 2025-10-24 at 6.47.21 PM పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, స్థానిక ప్రజలకు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యమని ఆయన అన్నారు.తరువాత ప్రభుదాస్ కృష్ణానగర్ పార్కును సందర్శించి, దాన్ని బయోవర్సిటీ పార్కు నమూనాలో అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణ, హార్టికల్చర్ ఆఫీసర్ లోకేష్, అధికారులు అశోక్, దేవీరాజ్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .