కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం

కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం

కుషాయిగూడ, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

 కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు సామూహికంగా “వందే మాతరం” గానం నిర్వహించారు. వందే మాతరం గేయం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో 200 మంది నారాయణా స్కూల్ విద్యార్థులు, స్థానిక పౌరులు, కుషాయిగూడ ఏసీపీ వై. వెంకట్ రెడ్డి, సిఐ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్సై సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, విజయ్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ వై. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, వందే మాతరం గేయం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అందించిన ప్రేరణ గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్న వయసులోనే చట్టాలను గౌరవిస్తూ, దేశం పట్ల భక్తి మరియు గౌరవభావం కలిగి ఉండాలని సూచించారు.
కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం