కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం

కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం

కుషాయిగూడ, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

 కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు సామూహికంగా “వందే మాతరం” గానం నిర్వహించారు. వందే మాతరం గేయం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో 200 మంది నారాయణా స్కూల్ విద్యార్థులు, స్థానిక పౌరులు, కుషాయిగూడ ఏసీపీ వై. వెంకట్ రెడ్డి, సిఐ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్సై సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, విజయ్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ వై. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, వందే మాతరం గేయం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అందించిన ప్రేరణ గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్న వయసులోనే చట్టాలను గౌరవిస్తూ, దేశం పట్ల భక్తి మరియు గౌరవభావం కలిగి ఉండాలని సూచించారు.
కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .