పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహణ

పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహణ

కాప్రా, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

పోలీస్ అమరవీరుల స్మారక ఉత్సవాల లో భాగంగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సైకిల్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. ఈ ర్యాలీ ఉదయం 6:30 గంటలకు ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వద్ద ప్రారంభమై, ఏ ఎస్ రావు నగర్ సిగ్నల్ వరకు వెళ్లి తిరిగి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వద్ద ముగిసింది.కుషాయిగూడ ఏసిపి వై. వెంకటే రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్‌ఐలు ఎన్. సుధాకర్ రెడ్డి, ఎన్. వెంకన్న, సతీష్, విజయ్ తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాఫల్యంగా జరిగింది. విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా ర్యాలీకి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా ఏసిపి వెంకటే రెడ్డి మాట్లాడుతూ — “దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మన అందరి బాధ్యత. వారి సేవా త్యాగాలను గుర్తు చేస్తూ, సమాజంలో పోలీసుల పట్ల గౌరవ భావం పెంచడమే ఈ ర్యాలీ ఉద్దేశ్యం” అని తెలిపారు.కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలకు అధికారులు ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .