పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహణ

పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహణ

కాప్రా, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

పోలీస్ అమరవీరుల స్మారక ఉత్సవాల లో భాగంగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సైకిల్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. ఈ ర్యాలీ ఉదయం 6:30 గంటలకు ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వద్ద ప్రారంభమై, ఏ ఎస్ రావు నగర్ సిగ్నల్ వరకు వెళ్లి తిరిగి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వద్ద ముగిసింది.కుషాయిగూడ ఏసిపి వై. వెంకటే రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్‌ఐలు ఎన్. సుధాకర్ రెడ్డి, ఎన్. వెంకన్న, సతీష్, విజయ్ తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాఫల్యంగా జరిగింది. విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా ర్యాలీకి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా ఏసిపి వెంకటే రెడ్డి మాట్లాడుతూ — “దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మన అందరి బాధ్యత. వారి సేవా త్యాగాలను గుర్తు చేస్తూ, సమాజంలో పోలీసుల పట్ల గౌరవ భావం పెంచడమే ఈ ర్యాలీ ఉద్దేశ్యం” అని తెలిపారు.కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలకు అధికారులు ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం