క్రీడా క్రమశిక్షణతోనే విజయం సాధ్యం
జిల్లెల్ల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
వనపర్తి,నవంబర్06(తెలంగాణ ముచ్చట్లు):
గోపాల్ పేట్ మండలం బుద్ధారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల 11వ క్రీడా మీట్ ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థుల చేత గౌరవ వందనం స్వీకరించారు.
డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు సమన్వయ సామర్థ్యాలను పెంపొందించడంలో సహాయపడతాయని తెలిపారు. క్రీడాకారులు దృఢంగా, శక్తివంతంగా ఉండటానికి పౌష్టికాహారం ముఖ్యమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచి క్రీడాకారుల శారీరక ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నదని వివరించారు.
డాక్టర్ చిన్నారెడ్డి ముఖ్యంగా మహిళా క్రీడాకారుల విజయాలను ప్రశంసిస్తూ, ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో సాధించిన విజయం దేశ ప్రతిష్టను పెంచిందని, యువ క్రీడాకారులు కూడా ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్న సూచన చేశారు
. క్రీడల్లో గెలుపు-ఓటములు సహజమని, ఈ ప్రక్రియలో కష్టపడి మరింత శ్రమించడం ద్వారా విజయం సాధించవచ్చని విద్యార్థులను ప్రేరేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభవంతులైన క్రీడాకారులకు అవసరమైన వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉందని, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని సూచించారు. అలాగే, గ్రూప్ 1, గ్రూప్ 2 నియామక పత్రాలు ఇచ్చే సమయంలో తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా 20 శాతం జమ చేస్తారని వివరించారు.
క్రీడాకారులు జాతీయ స్థాయిలో విజయవంతమైనవారిని డాక్టర్ చిన్నారెడ్డి మరియు ఆదర్శ్ సురభి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి జిల్లా జెడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు మరియు స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు.


Comments