నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు 

కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం

నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు 

నాగారం, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

మాతృభూమి గీతం “వందే మాతరం” రచయిత బంకింఛంద్ర చటర్జీ రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాగారం మున్సిపాలిటీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.కార్యాలయ ప్రాంగణంలో అందరూ కలిసి దేశభక్తి ఉత్సాహంతో “వందే మాతరం” గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా వందే మాతరం గీతాన్ని సామూహికంగా గానం చేయడం దేశప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.IMG-20251107-WA0055 ప్రతి పౌరుడు భారత మాత పట్ల గౌరవం, గర్వం కలిగి ఉండాలి” అని అన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ బి. నాగిరెడ్డి, రెవెన్యూ అధికారి బి. నాగేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం