అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అష్టోత్తరశత 108 కలశాలతో క్షీరాభిషేకం

అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అష్టోత్తరశత 108 కలశాలతో క్షీరాభిషేకం

కీసర, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌.వి. నగర్‌ రోడ్‌ నం.8 లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం భక్తి శ్రద్ధలతో అష్టోత్తరశత (108) కలశములతో క్షీరాభిషేకం నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ కోదండ రామాంజనేయ స్వామి, శ్రీ వల్లి దేవసేనా సహిత సుబ్రహ్మణ్య స్వామి, నాగబంధ, మృత్యుంజయ, మేధా దక్షిణామూర్తి, అభయాంజనేయ, నవగ్రహ విగ్రహాలకు క్షీరాధివాసం జరిపారు. ఆలయంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈ నెల 29 వరకు కొనసాగుతాయని, అదే రోజు బుధవారం దేవతామూర్తుల ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు ఎం.వి.ఎల్‌.ఎన్‌. శాస్త్రి తెలిపారుWhatsApp Image 2025-10-27 at 8.02.13 PM.కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ, సహాయక అర్చకులు జమ్మలమడక శ్రీరమణ శర్మ, ఆలయ అధ్యక్షులు దాచా శ్రీనివాస్ గుప్తా, ఎర్రం ఈశ్వరయ్య గుప్త, లింగా నాగేంద్ర గుప్త, పీవీవీ. సత్యనారాయణ నరసింహస్వామి గౌడ్, గంగిరెడ్డి నరేందర్ రెడ్డి, మారెళ్ల వెంకటేశ్వరావు, వి. నర్సింహస్వామి గౌడ్, ఆంజనేయ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం