సిఐటియు జిల్లా మహాసభల వాల్ పోస్టర్ విడుదల

సిఐటియు జిల్లా మహాసభల వాల్ పోస్టర్ విడుదల

కీసర, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్‌ (సిఐటియు) కీసర మండల కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈనెల 25, 26 తేదీల్లో చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని సిఐఏ కార్యాలయంలో జరగనున్న మహాసభల సందర్భంగా గోధుమకుంట, కరీంగూడ, దయార, దమ్మైగూడ ప్రాంతాల్లో పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ బంగారు నర్సింహరావు మాట్లాడుతూ, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభల్లో గత కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం, కార్మికుల హక్కుల సాధన కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూసిఐటియు పోరాటం కొనసాగిస్తుందని ఆయన అన్నారు. WhatsApp Image 2025-10-24 at 9.23.03 PM కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కట్ట జంగయ్య, సిఐటియు నాయకులు సిహెచ్. అశోక్, జీ. వెంకటేష్, ఎన్. స్వామి, లలిత, నిఖిల, మనేమ్మ, పుష్ప, అశ్విని, భాగ్యమ్మ, పోచయ్య, శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .