గండి రామారం పంపు హౌస్ ఎత్తిపోతల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

గండి రామారం పంపు హౌస్ ఎత్తిపోతల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

చిల్పూర్, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

చిల్పూర్ మండలం గండి రామారం గ్రామంలో సాగునీటి సరఫరా కోసం నిర్మిస్తున్న పంపు హౌస్ ఎత్తిపోతల పనులను మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించారు. రైతుల సాగు నీటి అవసరాలను తీర్చేలా పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వేల ఎకరాల భూమికి సాగు నీటి సదుపాయం లభించబోతోందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో రైతుల ఆర్థిక స్థితిలో గణనీయమైన మార్పు వస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.IMG-20251107-WA0038

Tags:

Post Your Comments

Comments

Latest News

రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
మల్కాజ్గిరి, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు) వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ పోలీస్...
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం
అమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు, గ్రీన్ బోర్డులు పంపిణీ
నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు 
కాజీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఘనంగా వందేమాతరo గీతా లాపన
నాగారం మద్యం దుకాణం పై రగడ
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం