నాగారం మద్యం దుకాణం పై రగడ

భాగస్వామ్యం వివాదం, భద్రతా ఆందోళనలతో ఉద్రిక్తత

నాగారం మద్యం దుకాణం పై రగడ

నాగారం, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

 నాగారం మున్సిపాలిటీ పరిధిలో నూతన మద్యం దుకాణం ఏర్పాటు చుట్టూ వివాదం రేగింది. ప్రభుత్వ లక్కీ డ్రాలో షాప్ నంబర్ 1 పవన్ రెడ్డి, జీవన్ రెడ్డికి రావడంతో వారు దుకాణం ప్రారంభానికి సిద్ధమ వుతున్నారు.ఈ క్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి స్థలం లీజుకు ఇవ్వాలని కోరగా, ఆయన భాగస్వామ్యం కోరినట్టు సమాచారం. దీనికి పవన్, జీవన్ రెడ్డి నిరాకరించడంతో చంద్రారెడ్డి వ్యతిరేక ధోరణి అవలంబించారని వారు ఆరోపించారు.ఈ నేపథ్యంలో సత్యనారాయణ కాలనీ వాసులను ఉసిగొల్పి నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారని పవన్, జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెక్యూరిటీ గార్డులను నియమించడం, మెయిన్ రోడ్డులోని సీసీ కెమెరాలను కీసర పోలీస్ స్టేషన్‌కి అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.ఇదే కాలనీలో రోడ్ నెంబర్ 12లో పాత మద్యం దుకాణం చంద్రారెడ్డి స్థలంలోనే నడుస్తోందని, దాని వెనుక చైతన్య ప్రైవేట్ పాఠశాల ఉన్నప్పటికీ అప్పట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదని వారు గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం వ్యతిరేకత చూపడం చంద్రారెడ్డి కుట్రపూరిత చర్య అని పవన్, జీవన్ రెడ్డి విమర్శించారు.అయితే మాజీ చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ“
సత్యనారాయణ కాలనీలో 400కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. మహిళలు, పిల్లల భద్రత దృష్ట్యా నివాస ప్రాంతంలో మద్యం దుకాణం సరికాదు. అందుకే కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు” అని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం