పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.
అశ్వారావుపేట, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్థానిక ప్రజలతో కలిసి నిత్యజీవన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.
మొదటగా ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలకు కొత్త పనిముట్లు అందజేశారు. కూలీలు తక్కువ శ్రమతో ఎక్కువ పని చేయడానికీ సౌకర్యం కల్పించే ఉద్దేశ్యంతో ఈ పనిముట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కూలీల కష్టానికి విలువ ఇవ్వడం, వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడం బాధ్యత అన్న భావాన్ని వ్యక్తం చేశారు.
తరువాత అశ్వారావుపేట బస్టాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలేరుపాడు మండల కేంద్రానికి కొత్త బస్సు సర్వీస్ ప్రారంభించారు. జెండా ఊపి బస్సును ప్రారంభించిన తరువాత ప్రజలతోపాటు బస్సులో ప్రయాణం చేశారు. ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరచడం కోసం నియోజకవర్గంలో అవసరమైన చోట మరిన్ని బస్సు సర్వీసులు ప్రవేశపెడతామని తెలిపారు.
మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని భవ్యశ్రీ చదరంగం క్రీడలో జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా ఆమెను అభినందించారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడం అవసరమని, భవ్యశ్రీ మరింత ఉన్నత శిఖరాలపై నిలిచేలా సహకారం అందిస్తామని తెలిపారు.
గుమ్మడవల్లి కొత్తూరు గ్రామంలో ఐటీడీఏ పరిధిలో అశ్వారావుపేట నియోజకవర్గానికి అదనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. గృహ లేని పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ అధికారులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Comments