విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపు లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలి

చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రిక ఆవిష్కరణలో కీసర ఎంఈఓ జమదగ్ని

విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపు లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలి

కీసర, నవంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు)

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే దిశగా పాఠశాల స్థాయిలో విభిన్న కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని కీసర మండల విద్యా అధికారి జమదగ్ని అన్నారు. కీసర మండల విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన “చెకుముకి సైన్స్ సంబరాలు – 2025” గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం పెంచడంలో చెకుముకి వేదిక ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎంఈఓ జమదగ్ని పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో గోడపత్రికలు, సైన్స్ ఫెయిర్‌లు, ప్రతిభా పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయవచ్చన్నారు.
జెవివి నాయకులు శేషగిరిరావు మాట్లాడుతూ – చెకుముకి పరీక్షల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు. పాఠశాల స్థాయిలో నవంబర్ 7న, మండల స్థాయిలో నవంబర్ 21న నాగారం ప్రభుత్వ పాఠశాలలో చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు  నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు 
నాగారం, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు): మాతృభూమి గీతం “వందే మాతరం” రచయిత బంకింఛంద్ర చటర్జీ రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాగారం మున్సిపాలిటీలో ఘనంగా...
కాజీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఘనంగా వందేమాతరo గీతా లాపన
నాగారం మద్యం దుకాణం పై రగడ
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం
గండి రామారం పంపు హౌస్ ఎత్తిపోతల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
మల్లన్నగండి రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల చేసిన ఎమ్మెల్యే కడియం
ఎంజేపీ గురుకులంలో ఘనంగా వందేమాతరం గీతాలాపన