నేడు డయల్ యువర్ డిపో మేనేజర్.

నేడు డయల్ యువర్ డిపో మేనేజర్.

సత్తుపల్లి, అక్టోబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రయాణికుల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కారం చూపే దిశగా ఆర్టీసీ తీసుకుంటున్న ప్రజాహిత చర్యల్లో భాగంగా సత్తుపల్లి డిపోలో ‘డయల్ యువర్ డిపో మేనేజర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఊటుకూరి సునీత తెలిపారు. ఈ కార్యక్రమం నేడు (సోమవారం) సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జరగనుందని చెప్పారు.

సత్తుపల్లి ఆర్టీసీ బస్సుల రాకపోకలు, టైమింగులు, సీటింగ్, బస్సుల శుభ్రత, సిబ్బంది ప్రవర్తన, రద్దీ, పర్సులు/లగేజీ సమస్యలు వంటి ఏదైనా అంశం పై ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సూచనలు, సమస్యలు, అభిప్రాయాలు నేరుగా చెప్పవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే సూచనలు సేవల మెరుగుదలకు ఎంతో తోడ్పడతాయని చెప్పారు. ప్రయాణికులు 9959225962 నంబర్‌కు ఫోన్ చేసి నేరుగా మాట్లాడవచ్చని తెలిపారు.

ప్రజా సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రజల భాగస్వామ్యం అవసరం కాబట్టి సత్తుపల్లి డిపో పరిధిలోని ప్రతి ప్రయాణికుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం