గోరక్షక కార్యకర్తపై కాల్పుల కేసులో వేగవంతమైన విచారణ

రాచకొండ పోలీసులకు అభినందనలు గోరక్షక కార్యకర్తలు

గోరక్షక కార్యకర్తపై కాల్పుల కేసులో వేగవంతమైన విచారణ

 ఘట్కేసర్‌, అక్టోబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు):

ఘట్కేసర్‌లో గోరక్షక కార్యకర్త బిడ్ల ప్రశాంత్‌పై జరిగిన కాల్పుల ఘటనలో రాచకొండ పోలీసులు వేగంగా స్పందించి కేవలం 12 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసుల చురుకైన చర్యలకు గోరక్షక్ సభ్యులు ప్రశంసలు కురిపించారు.సోమవారం రోజు గోరక్షక్ సభ్యులు రావుల శ్రీకాంత్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు ఐపీఎస్‌ను ఆయన కార్యాలయంలో కలిసింది. ఈ సందర్భంగా వారు పోలీస్ అధికారులకు పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా రావుల శ్రీకాంత్ మాట్లాడుతూ, “గోరక్షక కార్యకర్తపై జరిగిన దాడి సంఘటనతో మేమంతా ఆందోళన చెందాము. కానీ రాచకొండ పోలీసులు అత్యంత వేగంగా విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేయడం ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు చూపిన తక్షణ స్పందన అభినందనీయం” అని అన్నారు.రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ, “ఎవరి మీదైనా దాడి జరగడం అనేది చట్టవిరుద్ధం. ఇలాంటి సంఘటనల్లో పాలుపంచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల భద్రత మా మొదటి కర్తవ్యమని” అన్నారు.ఈ కార్యక్రమాల్లో పోలీస్ అధికారులతో పాటు గోరక్షక్ సంస్థ సభ్యులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం