గోరక్షక కార్యకర్తపై కాల్పుల కేసులో వేగవంతమైన విచారణ
రాచకొండ పోలీసులకు అభినందనలు గోరక్షక కార్యకర్తలు
ఘట్కేసర్, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
ఘట్కేసర్లో గోరక్షక కార్యకర్త బిడ్ల ప్రశాంత్పై జరిగిన కాల్పుల ఘటనలో రాచకొండ పోలీసులు వేగంగా స్పందించి కేవలం 12 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసుల చురుకైన చర్యలకు గోరక్షక్ సభ్యులు ప్రశంసలు కురిపించారు.సోమవారం రోజు గోరక్షక్ సభ్యులు రావుల శ్రీకాంత్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు ఐపీఎస్ను ఆయన కార్యాలయంలో కలిసింది. ఈ సందర్భంగా వారు పోలీస్ అధికారులకు పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా రావుల శ్రీకాంత్ మాట్లాడుతూ, “గోరక్షక కార్యకర్తపై జరిగిన దాడి సంఘటనతో మేమంతా ఆందోళన చెందాము. కానీ రాచకొండ పోలీసులు అత్యంత వేగంగా విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేయడం ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు చూపిన తక్షణ స్పందన అభినందనీయం” అని అన్నారు.రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ, “ఎవరి మీదైనా దాడి జరగడం అనేది చట్టవిరుద్ధం. ఇలాంటి సంఘటనల్లో పాలుపంచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల భద్రత మా మొదటి కర్తవ్యమని” అన్నారు.ఈ కార్యక్రమాల్లో పోలీస్ అధికారులతో పాటు గోరక్షక్ సంస్థ సభ్యులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.


Comments