ఆన్‌లైన్ వ్యభిచారం నుండి ఉగాండా మహిళల రక్షణ ఒకరు అరెస్ట్

 ప్రధాన నిందితుడు పరారీలో
రాచకొండ ఎహెచ్‌టియు పోలీసుల స్ఫూర్తిదాయక ఆపరేషన్

నాచారం, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు)

రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎహెచ్‌టియు పోలీసులు నాచారం స్థానిక పోలీసులతో కలిసి గురువారం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి చేసి, ఆన్‌లైన్ లోకాంటో యాప్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను బట్టబయలు చేశారు. ఈ దాడిలో ఉగాండా దేశానికి చెందిన ఇద్దరు విదేశీ జాతీయ మహిళలను రక్షించగా, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు భవానీనగర్ ప్రాంతంలోని ఓ గృహంపై దాడి చేయగా, అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు తేలింది.నిందితుల వివరాలు:డేనియల్ – నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. సంపత్ కుమార్ మోహితే (59), దివంగత నాగేందర్ రావు కుమారుడు, ప్రభుత్వ ఉద్యోగి (పోస్టల్), నివాసం: శ్రీ నిలయ టౌన్‌షిప్, బడంగ్‌పేట్, సరూర్‌నగర్ మండలం – కస్టమర్‌గా వ్యవహరించాడు.స్వాధీనం చేసుకున్న వస్తువులు:రూ. 8,050/- నగదు.రూ. 500/- మరియు రూ. 1,000/- జి-పే యూపీఐ చెల్లింపులు .6 మొబైల్ ఫోన్లు,2 కండోమ్‌లు
దర్యాప్తులో డేనియల్ లోకాంటో యాప్ ద్వారా ఆన్‌లైన్ వ్యభిచార గృహాన్ని నడుపుతూ, బాధిత మహిళల ఫోటోలను ఆన్‌లైన్‌లో పంచి కస్టమర్లను ఆకర్షించి డబ్బు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఆపరేషన్ రాచకొండ పోలీస్ కమిషనర్  జి. సుధీర్ బాబు, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, ఎల్.బి.నగర్–మహేశ్వరం ఎస్ఓటి ఏడిసిపి  ఎం.డి. షకీర్ హుస్సేన్, రాచకొండ ఎహెచ్‌టియు ఇన్‌స్పెక్టర్  ఎస్. దేవేందర్, నాచారం ఇన్‌స్పెక్టర్  కె. ధనుంజయ మరియు సిబ్బంది పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు.సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .