ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఘనపూర్, నవంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు):

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని లింగాల ఘనపూర్ మండలం జీడికల్ గ్రామంలోని విరాచల జీడికంటి శ్రీ రామచంద్ర స్వామి ఆలయంలో రూ.54 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈజిఎస్, ఎస్డిఎఫ్, ఎంపీ నిధుల ద్వారా నిర్మించిన సిసి రోడ్డు, కోనేరు వరకు మెట్ల నిర్మాణం, హైమాస్ట్ లైట్లు వంటి సౌకర్యాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ,

> “ప్రజలందరి సహకారంతో జీడికల్ రామచంద్ర స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలన్నదే నా సంకల్పం” అని పేర్కొన్నారు.

ఆలయ అభివృద్ధి కోసం దాతలను సంప్రదించి భక్తులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ధర్మకర్తల మండలికి సూచించారు. ఇంకా బస్టాండ్ నుండి దేవస్థానం వరకు రోడ్డు నిర్మాణం, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా త్వరలో చేపట్టాలని తెలిపారు.

స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మరియు పోలీస్ శాఖలు కలసి హెల్ప్ లైన్ సేవలను ఏర్పాటు చేయాలని తెలిపారు.WhatsApp Image 2025-11-06 at 9.02.56 PMWhatsApp Image 2025-11-06 at 9.02.55 PM

> “ఆలయాభివృద్ధిలో రాజకీయాలు అవసరం లేవు. ఇది భక్తి, సేవ, సమర్పణకు ప్రతీక. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనేలా అందరూ కృషి చేయాలి” అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఆర్డీవో గోపినాథ్, ఆలయ చైర్మన్, డైరెక్టర్లు, మార్కెట్ వైస్ చైర్మన్, మండల నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .