కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించిన కలెక్టర్
Views: 5
On
హనుమకొండ,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ పెద్దమ్మగడ్డ సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థినులకు అందిస్తున్న నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ కోచింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ ల్యాబ్ను, వసతి గృహాలను పరిశీలించి సౌకర్యాలపై అవగాహన పొందారు.
అదేవిధంగా కిచెన్ షెడ్ను పరిశీలించి విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజన సదుపాయం అందిస్తున్నారా అనే విషయాన్ని విచారించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా డిటిడిఓ ప్రేమకళ, ఆర్సిఓ డి.ఎస్. వెంకన్న, ప్రిన్సిపాల్ పద్మిని, అధ్యాపకులు పాల్గొన్నారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Nov 2025 22:13:14
-ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో సహస్ర బిల్వార్చన, మహా రుద్రాభిషేకం
ఎల్కతుర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి...


Comments