వందేమాతర గీతానికి 150 ఏళ్లు – మద్దిగట్ల పాఠశాలలో ఘనంగా వేడుకలు

వందేమాతర గీతానికి 150 ఏళ్లు – మద్దిగట్ల పాఠశాలలో ఘనంగా వేడుకలు

పెద్దమందడి,నవంబర్07(తెలంగాణ ముచ్చట్లు):

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి   ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్లలో వందేమాతర గీతం 150వ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం — గద్వాల కృష్ణ, ఏ. భగవంతు, వి. వాణి ప్రభ, పుల్లయ్య, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, శ్రీనివాసులు, చిన్నారెడ్డి — అలాగే ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొని సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాదరావు మాట్లాడుతూ..875 నవంబర్ 7న వందేమాతర గీతానికి అంకురార్పణ జరిగింది. గౌరవనీయులు బంకిమ్ చంద్ర చటర్జీ  తన ఆనందమఠ నవల ద్వారా ఈ గీతానికి విశేష ప్రాచుర్యం తీసుకువచ్చారు అని అన్నారు.

అలాగే ఈ గీతం స్వాతంత్ర్య సమరయోధులలో దేశభక్తి జ్వాలను రగిలించి, ఐకమత్యం మరియు ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, లాలా లజపతిరాయ్, సరోజినీ నాయుడు తదితర నాయకులు ఈ గీతానికి విశేష ప్రాచుర్యం కల్పించినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలతో వాతావరణాన్ని రక్తికట్టించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
మల్కాజ్గిరి, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు) వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ పోలీస్...
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం
అమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు, గ్రీన్ బోర్డులు పంపిణీ
నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు 
కాజీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఘనంగా వందేమాతరo గీతా లాపన
నాగారం మద్యం దుకాణం పై రగడ
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం