నిరుద్యోగులకు బంగారు అవకాశాలు అందించిన మెగా జాబ్ మేళా.
యువతకు కేరియర్ మార్గదర్శనం అందించడంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రత్యేక సహకారం
సత్తుపల్లి, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మెగా జాబ్ మేళా ఈ నెల 26న సత్తుపల్లి రాణి సెలబ్రేషన్స్ మైదానంలో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యంలో, సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సహకారంతో చేపడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యువతకు మార్గదర్శకత్వం అందించనున్నారు.
జాబ్ మేళాకు ముందే రెండు రోజుల పాటు, హెచ్ఆర్సీ నిపుణులచే కెరీర్ అవగాహన సదస్సులు, నైపుణ్య శిక్షణలు, రెస్యూమ్ తయారీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి శిక్షణలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ శిక్షణల్లో పాల్గొన్న యువత జాబ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి, దయానంద్ విజయకుమార్ సూచించారు.
ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ,
"సత్తుపల్లి నియోజకవర్గంలో ఇదే మొదటి యువత జాబ్ మేళా. యువతకు బంగారు భవిష్యత్తు కోసం మా వంతు సహకారం అందిస్తాం. ఇది యువతకు ప్రేరణగా మారుతుంది" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రాంతీయ అధికారులు, ప్రభుత్వం ప్రతినిధులు, విద్యా, వ్యవసాయ, ఆరోగ్య శాఖల అధికారులు క్రమశిక్షణగా పాల్గొన్నారు
. ముఖ్యంగా కల్లూరు ఏసిపి అనిశెట్టి రఘు, మున్సిపల్ కమిషనర్ నరసింహ, కిష్టారం ఓసి, మేనేజర్ నరసింహారావు, అగ్రికల్చర్ ఏవో శ్రీనివాస్, ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్ నండ్రు గోపి, సిడిపిఓ మెహరున్నిసా బేగం, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత తదితరులు పాల్గొన్నారు.
అలాగే, ఆషా వర్కర్స్, అంగన్వాడీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తలు కూడా కార్యక్రమంలో హాజరై, యువతకు అవకాశాలు సృష్టించడంలో సహకరించారు.
మొత్తం 3000కు పైగా యువత ఈ జాబ్ మేళా ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు


Comments