జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

జూబ్లీహిల్స్ లో ఎంపి కడియం కావ్య ప్రచారం 

జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే  -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

హైదరాబాద్,నవంబర్07(తెలంగాణ ముచ్చట్లు):

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్, బంజారా బస్తిల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజలను ఆత్మీయంగా పలకరించిన ఆమె స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.

ఈ నెల 11న జరగనున్న ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. నగరాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని జూబ్లీహిల్స్ ప్రజలకు పిలుపునిచ్చారు.

విపక్షాలు చెబుతున్న అసత్య ప్రచారాలకు లోనవ్వకుండా, స్థానిక సమస్యలకు పరిష్కారం చూపగల నాయకుడిగా నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజలతో నిత్యం మమేకమై, వారి కోసం కృషి చేసే నాయకత్వంIMG-20251107-WA0068 కాంగ్రెస్ పార్టీదేనని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .