ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
వందేమాతరం గీతం 150 ఏళ్ల వేడుకలు
Views: 2
On
మల్కాజ్గిరి, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
యావత్ భారతావనితోపాటు మెడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ప్రజలు కూడా “జయహో వందేమాతరం” అంటూ నినదించారు. భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రేరణగా నిలిచిన వందేమాతరం గీతం రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సామూహిక వందేమాతరం గాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు దేశభక్తి ఊపిరితో మార్మోగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇందులో భాగంగా ఈసీఐఎల్లోని మెగా జూనియర్ కాలేజీలో విద్యార్థులు ప్రత్యేకంగా సామూహిక వందేమాతరం గీతాలాపన చేశారు. విద్యార్థుల్లో దేశభక్తి భావాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని కళాశాల నిర్వాహకులు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Nov 2025 22:09:07
-మన స్వాతంత్ర్య సమరయోధులలో
ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం
-ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్
ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...


Comments