పంచాయతీరాజ్ ఉపవిభాగ కార్యాలయాన్ని ములకలపల్లికి మార్చాలి.

ఎమ్మెల్యే జారె

పంచాయతీరాజ్ ఉపవిభాగ కార్యాలయాన్ని ములకలపల్లికి మార్చాలి.

అశ్వారావుపేట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రస్తుతం పంచాయతీరాజ్ ఉపవిభాగ కార్యాలయం ములకలపల్లి పరిధికి చెందినది అయినప్పటికీ, అది అశ్వారావుపేటలో నిర్వహించబడుతోంది. ఈ కారణంగా ములకలపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా ములకలపల్లి నుండి అశ్వారావుపేట వరకు 50 కిలోమీటర్లకు పైగా దూరం ఉండటం చేత ప్రజలకు, అధికారులకు ప్రయాణ భారంగా మారింది. ఫలితంగా పనులు ఆలస్యమవుతున్నాయని స్థానిక ప్రజా ప్రతినిధులు పలుమార్లు తెలియజేశారు.

ఈ నేపథ్యంలో, ములకలపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి సులభంగా లభ్యమవుతున్నందున, అశ్వారావుపేటలో ఉన్న పంచాయతీరాజ్ ఉపవిభాగ కార్యాలయాన్ని ములకలపల్లికి మార్చవలసిందిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం హైదరాబాద్‌లో స్త్రీ-శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రివర్యులు ధనసరి సీతక్క (అనసూయ) ను కలిసారు.
అవసరమైన వసతుల కల్పన కోసం గిరిజన ఉపనిధుల ద్వారా సహకారం అందించాలంటూ ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .