సమాజాన్ని కలచివేసిన బస్సు దుర్ఘటన
చిన్న తప్పు పెద్ద విషాదాన్ని మిగిలించింది
కీసర, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
కర్నూల్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం యావత్ సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని ఎన్బిఎంఐ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రవి రాజ్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కీసర కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ — ఈ దుర్ఘటనలో నిరపరాధులైన ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని తెలిపారు.“చిన్న తప్పులు, క్షణిక నిర్లక్ష్యం ఎంతటి పెద్ద విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి మనకు గుర్తు చేసింది,” అని రవి రాజ్ రాథోడ్ పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్ జాగ్రత్తగా ఉండి ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. వాహనం నడిపే ప్రతీ వ్యక్తి ట్రాఫిక్ నియమాలను కేవలం చట్టబద్ధత కోసమే కాకుండా మానవతా బాధ్యతగా భావించాలని విజ్ఞప్తి చేశారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలసి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.“మన జాగ్రత్తే మన ప్రాణాలకు రక్షణ” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరు గుండెల్లో ముద్రించు కోవాలని రవి రాజ్ రాథోడ్ తెలిపారు.


Comments