భగీరథుడి పట్టుదల అందరికీ ఆదర్శం

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

భగీరథుడి పట్టుదల అందరికీ ఆదర్శం

పెద్దమందడి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల కేంద్రంలో భగీరథ మహర్షి విగ్రహాన్ని శుక్రవారం వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భగీరథుడి పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాలని అన్నారు. నేను ఎల్లవేళలా భగీరథ మహర్షిని నా వ్యక్తిగత ఆదర్శంగా తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.

సగరుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు చేయడం ద్వారా సగరులకు నిజమైన గుర్తింపు లభిస్తోందని ఎమ్మెల్యే వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచారని  అన్నారు.

పెద్దమందడి మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో సగరుల సామూహిక భవనం అభివృద్ధి చేయబడనున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో సగర సంగం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-10-24 at 4.18.46 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం