భగీరథుడి పట్టుదల అందరికీ ఆదర్శం

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

భగీరథుడి పట్టుదల అందరికీ ఆదర్శం

పెద్దమందడి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల కేంద్రంలో భగీరథ మహర్షి విగ్రహాన్ని శుక్రవారం వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భగీరథుడి పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాలని అన్నారు. నేను ఎల్లవేళలా భగీరథ మహర్షిని నా వ్యక్తిగత ఆదర్శంగా తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.

సగరుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు చేయడం ద్వారా సగరులకు నిజమైన గుర్తింపు లభిస్తోందని ఎమ్మెల్యే వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచారని  అన్నారు.

పెద్దమందడి మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో సగరుల సామూహిక భవనం అభివృద్ధి చేయబడనున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో సగర సంగం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-10-24 at 4.18.46 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .