చక్రిపురం లో శ్రీ ధన్వంతరి ఫార్మసీ–పౌలిక్లినిక్ ప్రారంభం
చర్లపల్లి, నవంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రిపురం చౌరస్తాలో ఆధునిక వైద్య సదుపాయాలతో శ్రీ ధన్వంతరి ఫార్మసీ & పౌలిక్లినిక్ శనివారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ప్రొప్రైటర్ అఖిల్ తేజ ఈ పౌలిక్లినిక్ను అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు సోమశేఖర్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సీతారాం రెడ్డి, యాదిరెడ్డి తదితరులు ధన్వంతరి ఫార్మసీ ప్రారంభోత్సవంపై శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రొప్రైటర్ అఖిల్ తేజ మాట్లాడుతూ,“క్లినిక్లో నైపుణ్యమైన జనరల్ మరియు ఎంబిబిఎస్ వైద్యులు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆధునిక పద్ధతులతో ఉత్తమ సేవలు అందించటం మా లక్ష్యం. మా కోసం మొదట సేవ, తరువాతే వ్యాపారం” అని అన్నారు.అదనంగా, ఈ పౌలిక్లినిక్లో హెయిర్ అండ్ స్కిన్, కాస్మొటిక్, ఎస్థిటిక్ ట్రీట్మెంట్లు కూడా అందుబాటులో ఉంటాయనిఅఖిల్ తేజ తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరికొందరు బంధుమిత్రులు పాల్గొన్నారు. 


Comments