తిరుమలనగర్ కాలనీలో మిగిలిన అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేస్తాం 

కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్

తిరుమలనగర్ కాలనీలో మిగిలిన అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేస్తాం 

కాప్రా, నవంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు)

మీర్పేట్ హెచ్.బీ కాలనీ డివిజన్ పరిధిలోని తిరుమలనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ కు వినతిపత్రం అందజేశారు.కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు  పూర్తయిన పనులు మినహా ఇంకా మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, “తిరుమలనగర్ కాలనీలో డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు పనులు కొంతవరకు పూర్తయ్యాయి. మిగిలిన పనులు త్వరగా పూర్తయ్యేలా ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు చేపడతాం” అని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో సెక్రటరీ అమరేంద్ర బాబు, కోశాధికారి బీడీ దాస్, లీగల్ అడ్వైజర్ శ్రీను, కృష్ణమోహన్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!