కైలాసగిరి కాలనీ ఎన్నికలు గందరగోళంలో

మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌కు ఫిర్యాదు

కైలాసగిరి కాలనీ ఎన్నికలు గందరగోళంలో

మేడ్చల్–మల్కాజిగిరి, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంమీర్పేట్ హౌసింగ్ బోర్డు నాలుగో డివిజన్‌ లోని కైలాసగిరి వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు వివాదా ల్లోకి చేరాయి. గత 16 సంవత్సరాలు గా అసోసియేషన్‌లో మహిళలకు పదవులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నారని పలువురు కాలనీవాసులు ఆరోపించారు.రిజిస్ట్రేషన్ నెంబర్ 91/2009తో రిజిస్టర్ అయిన అసోసియేషన్‌లో మహిళలను కేవలం సభ్యులుగా మాత్రమే తీసుకుంటున్నామని,“పదవులు మాత్రం ఇవ్వం… కొత్త సాంప్రదాయాలు వద్దు” అంటూ కొందరు బాధ్యులు మహిళలను ఎన్నికలు నుండి దూరం చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం మహిళల పేర్లపైనే పట్టా భూములను జారీ చేస్తుండగా, కాలనీ అభివృద్ధి పనుల్లో మాత్రం మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం అని వారు పేర్కొన్నారు.గతంలో చాలామంది మహిళలు నామినేషన్ వేసేందుకు ముందుకొచ్చినా, వారి నామినేషన్లు స్వీకరించిన రికార్డులు లేవని మహిళలు ఆరోపిస్తున్నారు.“బస్తీల్లోనే మహిళలు పదవులు చేపట్టలేరని చెప్పి అణగదొక్కుతు న్నారు. అదే బస్తీల్లో ఇతర అసోసియేషన్లు మహిళలతో సేవలు అందిస్తున్నాయి. మరి కైలాసగిరిలో ఎందుకు కాదు?” అని మహిళలు ప్రశ్నించారు.“ఇదేమి రాజ్యం? దోపిడి రాజ్యమా?” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ప్రాతి నిధ్యం కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే, మరో కొత్త కాలనీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుందని మహిళలు స్పష్టంగా హెచ్చరించారు.మహిళలను ఎన్నికల ప్రక్రియ నుండి దూరం చేస్తున్నారన్న ఆరోపణలతో ఎన్నికలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కైలాసగిరి కాలనీ ఎన్నికలపై ఈ వివాదం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!