పదోన్నతి పై బదిలీ అవుతున్న దేవదాసు కు ఘన సన్మానం.!

పదోన్నతి పై బదిలీ అవుతున్న దేవదాసు కు ఘన సన్మానం.!

సత్తుపల్లి, నవంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

పట్టణ పరిధిలోని జలగం వెంగళరావు సింగరేణి ఉపరితల గని కార్యాలయంలో సంక్షేమ (వెల్ఫేర్) అధికారిగా విధులు నిర్వహించి, కొత్తగూడెం సింగరేణి సూపర్ మార్కెట్‌కు మేనేజర్‌గా పదోన్నతి పొందిన దేవదాసు బుధవారం బదిలీ అవుతుండగా సింగరేణి సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వారు, సింగరేణి జే.వి.ఆర్. ఓ.సి లో అన్ని విభాగాల ఉద్యోగులను సంఘటితం చేసి, సంక్షేమ అధికారిగా ప్రతి ఒక్కరి సమస్యపై స్పందించిన ఏకైక అధికారి దేవదాసు అని పేర్కొన్నారు. ఉద్యోగులతో సౌహార్దంగా ప్రవర్తించిన తీరు, ఆయన మంచితనమే ఉన్నతాధికారులను మెప్పించి ఈ పదోన్నతిని అందించినదని అభిప్రాయపడ్డారు.

రానున్న రోజుల్లో దేవదాసు మరెన్నో ఉన్నత హోదాలు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ & పిసి జూనియర్ ఇన్స్పెక్టర్, జమేధార్‌లు, సీనియర్ సెక్యూరిటీ గార్డ్స్, ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!