48 గంటల్లో గన్ని సంచుల సరఫరా .... 

అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి

48 గంటల్లో గన్ని సంచుల సరఫరా .... 

ఖమ్మం బ్యూరో, నవంబర్ -8, తెలంగాణ ముచ్చట్లు;

ధాన్యం కొనుగోలుకు అవసరమైన మేర గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, ప్రతిపాదనలు పంపిన 48 గంటల లోపు కొనుగోలు కేంద్రాలకు గన్ని సంచులు సరఫరా చేస్తున్నామని  అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ -2025 ధాన్యం కొనుగోలుకు  సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు.  జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్ని సంచులు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో పెట్టడం జరిగిందని అన్నారు.  ధాన్యం కొనుగోలు అవసరాలకు మాత్రమే గన్ని సంచులు అందించడం జరుగుతుందని, రైతుల ఇంటి వద్దకు గన్ని సంచులు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 9 లక్షల 71 వేల 500 గన్ని సంచులు పంపిణీ చేశామని అన్నారు. గన్ని సంచుల కోసం కొనుగోలు కేంద్రాలు ఇండెంట్ పెట్టిన 48 గంటల లోగా సరఫరా చేస్తున్నామని, గన్ని సంచులకు జిల్లాలో ఎక్కడా కొరత లేదని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .