48 గంటల్లో గన్ని సంచుల సరఫరా .... 

అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి

48 గంటల్లో గన్ని సంచుల సరఫరా .... 

ఖమ్మం బ్యూరో, నవంబర్ -8, తెలంగాణ ముచ్చట్లు;

ధాన్యం కొనుగోలుకు అవసరమైన మేర గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, ప్రతిపాదనలు పంపిన 48 గంటల లోపు కొనుగోలు కేంద్రాలకు గన్ని సంచులు సరఫరా చేస్తున్నామని  అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ -2025 ధాన్యం కొనుగోలుకు  సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు.  జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్ని సంచులు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో పెట్టడం జరిగిందని అన్నారు.  ధాన్యం కొనుగోలు అవసరాలకు మాత్రమే గన్ని సంచులు అందించడం జరుగుతుందని, రైతుల ఇంటి వద్దకు గన్ని సంచులు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 9 లక్షల 71 వేల 500 గన్ని సంచులు పంపిణీ చేశామని అన్నారు. గన్ని సంచుల కోసం కొనుగోలు కేంద్రాలు ఇండెంట్ పెట్టిన 48 గంటల లోగా సరఫరా చేస్తున్నామని, గన్ని సంచులకు జిల్లాలో ఎక్కడా కొరత లేదని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!