తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సమీక్షించిన రాచకొండ సీపీ
మేడ్చల్ మల్కాజ్గిరి, నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు) :
డిసెంబర్ 8, 9 తేదీల్లో మీరఖాన్పేటలో జరగనున్న తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ బందోబస్తు ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు.సీపీ సుధీర్ బాబు హెలిపాడ్ ప్రదేశం, పార్కింగ్ ప్రాంతం, మీటింగ్ వేదికను ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ ప్లానింగ్, భద్రతా చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సమ్మిట్కి హాజరయ్యే ప్రముఖ అతిథులు, ప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని ఏకగ్రీవంగా, సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు.ఈ పర్యటనలో మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఐపీఎస్, ఎస్బీ డీసీపీ జి. నరసింహారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు తదితర ఉన్నంత అధికారులు పాల్గొన్నారు
సమ్మిట్ తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన దోహదపడుతుందని అధికారులు వెల్లడించారు


Comments