కూసుమంచి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కూసుమంచి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఖమ్మం బ్యూరో, నవంబర్ 8, తెలంగాణ ముచ్చట్లు;

 కూసుమంచిలోని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.... ఇళ్లులేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు సహాయం, యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం  తీసుకువస్తున్న మార్పుల సంకేతాలని పేర్కొన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే సంక్షేమ పాలన రాష్ట్రంలో అమలవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!