సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి

మల్కాజిగిరి, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి డివిజన్‌కు చెందిన పలువురు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి చేసిన దరఖాస్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు మొత్తం రూ. 1,02,000 రూపాయల ఆర్థిక సాయం మంజూరయ్యింది.సహాయ నిధి కింద చెక్కులు పొందిన వారు:చుక్క మల్లేష్ రూ.60,000,మేహునిసా బేగం రూ .15,000,నందు కుమార్ రూ.27,000.సోమవారం బోయిన్‌పల్లి ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫిస్‌లో శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తో కలిసి బాధితులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,“సీఎం సంక్షేమ సహాయనిధి పేదలు అనారోగ్యానికి గురైన సమయంలో వారికి ఆపన్న హస్తంలా ఉపయోగపడుతోంది. ప్రతి అర్హుడికి ప్రభుత్వం అండగా ఉంటుంది” అని అన్నారు.నిరుపేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, అనిల్ కిషోర్, కరంచంద్, జనార్ధన్, తులసి సురేష్, సంతోష్, బాలకృష్ణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!