పోలీసు అమరవీరులకు నివాళిగా బైక్ ర్యాలీ.

పోలీసు అమరవీరులకు నివాళిగా బైక్ ర్యాలీ.

సత్తుపల్లి, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

పోలీసు జెండా దినోత్సవాల లో భాగంగా బి గంగారం 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం గంగారం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బెటాలియన్ నుండి బయలుదేరిన ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగి ప్రజల్లో పోలీసు అమరవీరుల త్యాగాలపై అవగాహన కల్పించారు. బెటాలియన్ సిబ్బంది, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బెటాలియన్ అదనపు కమాండెంట్ ఏ. అంజయ్య మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ సామాజిక భద్రత, ప్రజల ప్రశాంత జీవనానికి అండగా నిలుస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో బెటాలియన్ సహాయ కమాండెంట్లు ఎస్.శ్రీధర్ రాజా, యస్.డి. రంగారెడ్డి, ఇతర అధికారులు, కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20251025-WA0006IMG-20251025-WA0005

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .